Sat Mar 28 2026 15:02:33 GMT+0530 (India Standard Time)
Amaravathi : అమరావతి రైతులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. క్యాపిటయిల్ గెయిన్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వంపై నమ్మకంతో భూములిచ్చిన రైతులకు ఈ అవకాశాన్ని కల్పించింది.
భూములిచ్చిన రైతులకు...
దీంతో భూములిచ్చిన అమరావతి రైతులకు ఊరట కలిగినట్లయింది. మార్చి 31వ తేదీ 2031 వరకూ ఈ నిబంధన అమలులో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story

