Mon Feb 02 2026 14:08:12 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మరో హామీని గ్రౌండ్ చేసిన కూటమి సర్కార్
కూటమి ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది.

కూటమి ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. హజ్ యాత్రికులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వారికి ఈ సాయం వర్తిస్తుంది. హజ్ యాత్రికులకు వెళ్లే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీలు ఇచ్చాయి.
హజ్ యాత్రకు వెళ్లే వారికి...
ఆ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాయి. అయితే ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. హజ్ యాత్రకు ఏటా అనేక మంది వెళ్లి అక్కడ మక్కా మసీదును దర్శించుకుని వస్తుంటారు. అందులో భాగంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
Next Story

