Fri Dec 05 2025 11:12:58 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో భారీగా పంట నష్టం.. రైతులను ఆదుకునేదెవరు?
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, క్లౌడ్ బరస్ట్ కారణంగా తెలంగాణలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పంట నష్టం జరిగింది

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, క్లౌడ్ బరస్ట్ కారణంగా తెలంగాణలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పంట నష్టం జరిగింది. తెలంగాణలో గత మూడు రోజులుగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజులుగా మెదక్, కామారెడ్డి,ఆదిలాబాద్,నిజామాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి ఊరిమీద, పొలాల మీద పడ్డాయి. దీంతో భారీగా పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
పంట నష్టంపై...
తెలంగాణలో 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కామారెడ్డిలో 77 వేల ఎకరాలు నష్టపోయినట్లు గుర్తించారు. జనజీవనం అస్తవ్యవస్థమయ్యింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి.ఊర్లకు ఊర్లు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది.రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టాలపై ప్రభుత్వం ప్రాథమిక రిపోర్ట్ విడుదల చేసింది. వాతావరణ శాఖ. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం కలిగించాయని తెలిపింది. వ్యవసాయ శాఖ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం మొత్తం 28 జిల్లాల్లో 2. 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని... రాష్ట్రవ్యాప్తంగా 1.43 ,304 మంది రైతులు నష్టపోయారని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
ఈ జిల్లాల్లో అత్యధికంగా...
అత్యధికంగా కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పంటల నష్టం ఎక్కువగా నమోదైంది. కామారెడ్డి జిల్లాలోనే 77 ,394 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో 23 ,169 ఎకరాలు, ఆదిలాబాద్లో 21,276 ఎకరాలు, నిజామాబాద్లో 18,417 ఎకరాలు, కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో 15 317 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఆ తర్వాత అత్యధికంగా నష్టపోయిన జిల్లాల్లో మంచిర్యాల,ఖమ్మం, నిర్మల్, సూర్యపేట, సిద్దిపేట సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల ,పెద్దపల్లి, వనపర్తి, భూపాలపల్లి, మహబూబ్ నగర్ , ములుగు,సిరిసిల్లా, నాగర్ కర్నూల్, నల్గొండ, జగిత్యాల రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. పంట పొలాల్లో ఇసుక మేట వేసింది.
కేంద్రానికి నివేదిక...
జిల్లాల వారీగా చూస్తే వరి పంట అత్యధికంగా దెబ్బతింది. మొత్తం 1.09 లక్షల ఎకరాలు వరి నీట మునిగింది. పత్తి 60 వేల ఎకరాలు నష్టం చవిచూసింది. మొక్కజొన్న 16 వేల ఎకరాలు, వేరుశనగ 20వేల 900 ఎకరాల్లో దెబ్బతింది. సోయాబీన్, టమాట, మిర్చి, మినుములు, ఇతర హార్టికల్చర్ పంటలు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు అనేక ఇళ్లలో ఫర్నీచర్ దెబ్బదినింది. ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పంట నష్టానికి సంబంధించిన ప్రాధమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి రైతులకు సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story

