Sat Dec 06 2025 00:22:11 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు మరో మోస్ట్ ఇంట్రస్టింగ్ మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ లో రికార్డులు నమోదవుతన్నాయి. కొత్త కుర్రోళ్లు రెచ్చిపోతున్నారు. టీం ఇండియాకు మంచి ఆటగాళ్లు ఈ ఐపీఎల్ ద్వారా కూడా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ ప్రాంరభమయిన నాటి నుంచి ప్రతి మ్యాచ్ అభిమానులను అలరిస్తుంది కొన్ని మ్యాచ్ లు అతి తక్కువ పరుగులు చేసి పూర్తయితే.. మరికొన్ని గత రికార్డులు బద్దలు కొడుతూ అత్యధిక పరుగులు చేస్తున్నాయి. హైదరాబాద్ లో సన్ రైజర్స్ మ్యాచ్ ఈ రికార్డును బద్దలు కొట్టింది.
అహ్మదాబాద్ లో...
ఈరోజు ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మోస్ట్ ఇంట్రస్టింగ్ మ్యాచ్ ఇది. ఎందుకంటే రెండు జట్లలో మంచి హిట్టర్లున్నారు. బౌలర్లున్నారు. పరుగులు చేసే సత్తా ఉన్నోళ్లు ఉండటంతో ఎవరిది గెలుపు అన్న అంచనాలు మాత్రం చివర వరకూ తేలే పరిస్థితి ఉండదు. ఈరోజు కూడా క్రికెట్ ఫ్యాన్స్ మంచి ఫీస్ట్ ఈ మ్యాచ్ అని చెప్పాలి.
Next Story

