తుఫాను ముప్పు.. రద్దైన 142 రైళ్ల వివరాలు ఇవే!!

మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు భారీగా రద్దయ్యాయి. విజయవాడ మీదుగా గ్రాండ్‌ మెయిన్‌ ట్రంక్‌ లైన్‌ మీద రాకపోకలు సాగించే రైళ్లను భారీ సంఖ్యలో రైల్వే శాఖ రద్దు చేసింది.
మొత్తం 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే ప్రయాణికులను దక్షిణ మ‌ధ్య రైల్వే (ఎస్సీఆర్‌) అల‌ర్ట్ జారీ చేసింది. తుపాన్ తీరాన్ని దాటనున్న నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) ప‌రిధిలో 142 రైళ్లు ర‌ద్దు చేశామ‌ని సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు.
ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ విమానాలను కూడా రద్దు చేశారు. విజయవాడ నుంచి న్యూఢిల్లీ వెళ్లే దురంతో సూపర్‌ఫాస్ట్‌ కూడా రద్దయ్యింది. విజయవాడ-చెన్నై వెళ్లే పినాకిని రద్దయ్యింది.
విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-సికింద్రాబాద్‌, విశాఖపట్నం-సికింద్రాబాద్‌, విజయవాడ-గూడూరు, నర్సాపూర్‌-కొట్టాయం, కాకినాడ టౌన్‌-తిరుపతితోపాటు సికింద్రాబాద్‌-విజయవాడ, లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు.
సికింద్రాబాద్‌ - విశాఖ, విజయవాడ-బెంగళూరు మధ్యన నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి