Sun Feb 16 2025 03:15:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు షాకిచ్చిన ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎంపీని కలవడం కలకలం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ను బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే [more]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎంపీని కలవడం కలకలం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ను బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే [more]

టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎంపీని కలవడం కలకలం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ను బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కలవడం చర్చనీయాంశంమయింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో షకీల్ తనకు చోటు దక్కుతుందని ఆశించారు. మంత్రి పదవి రాకపోవడంతో షకీల్ అసంతృప్తితో ఉన్నారంటున్నారు. వీరి మధ్య టీఆర్ఎస్ అసంతృప్తులు ఎవరెవరు ఉన్నారన్నదానిపై చర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే షకీల్ మర్యాదపూర్వకంగానే బీజేపీ ఎంపీని కలిశారా? లేక పార్టీ మారాలన్న యోచనలోనే కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story