Sat Apr 20 2024 01:53:05 GMT+0000 (Coordinated Universal Time)
Huzurabad : ఇంకా 18 రౌండ్లు ఉన్నాయి.. అప్పుడే చెప్పలేం
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నాలుగో రౌండ్ వరకే పూర్తయింది. ఇంకా 18 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఈ నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల [more]
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నాలుగో రౌండ్ వరకే పూర్తయింది. ఇంకా 18 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఈ నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల [more]
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నాలుగో రౌండ్ వరకే పూర్తయింది. ఇంకా 18 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఈ నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కేవలం పదిహేడు వేల ఓట్ల ఆధిక్యతతోనే ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది. అందుకే ఇప్పుడే బీజేపీ గెలిచినట్లు చెప్పలేమని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో తమకు అనుకూలంగా ఉంటుందని టీఆర్ఎస్ చెబుతుండగా, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బీజేపీ ధీమాగా ఉంది. మొత్తం మీద హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పోటీ నువ్వా? నేనా ? అన్నట్లు ఉంది.
Next Story