Wed Oct 04 2023 00:16:04 GMT+0000 (Coordinated Universal Time)
ముద్రగడ ఆలోచించి చెబుతామన్నారు
ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ ముగిసింది. [more]
ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ ముగిసింది. [more]

ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ ముగిసింది. తాను రాష్ట్ర రాజకీయాలను ముద్రగడకు వివరించినట్లు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ వైఫల్యాల వల్ల అభివృద్ధి జరగకపోవడం, కేవలం కొన్ని కుటుంబాలే బాగుపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామన్నారు. ఆయన బీజేపీలో చేరికపై ఆలోచించి తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. ముద్రగడ బీజేపీలో చేరితే మరింత బలం పెరుగుతుందని తెలిపారు. ఇలాంటి వారిని త్వరలో తాను మరింత మందిని కలుస్తానని సోము వీర్రాజు చెప్పారు.
Next Story