బ్రేకింగ్ : దిశనే కాదు మరో 9 మందిని?
దిశ కేసులో నిందితులు ఎంత మంది మహిళలు చంపారు? ఎంత మందిపై అత్యాచారం చేశారు? ఎంత మంది మహిళలను కాల్చివేశారు? ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న ఇది. [more]
దిశ కేసులో నిందితులు ఎంత మంది మహిళలు చంపారు? ఎంత మందిపై అత్యాచారం చేశారు? ఎంత మంది మహిళలను కాల్చివేశారు? ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న ఇది. [more]

దిశ కేసులో నిందితులు ఎంత మంది మహిళలు చంపారు? ఎంత మందిపై అత్యాచారం చేశారు? ఎంత మంది మహిళలను కాల్చివేశారు? ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న ఇది. అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణలో నిందితుడు చెప్పిన విషయాలని బట్టి పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీస్ కస్టడీ సమయంలో వారు చెప్పిన వివరాలను బట్టి అధికారులు బృందాలతో పూర్తిగా ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. అయితే ఐదు జిల్లాల్లో నలుగురికి కిరాతకుల రాక్షస కాండ కొనసాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పద్ధతుల్లో అధికారులు విచారణ చేశారు.
నిందితుల డీఎన్ఏతో …
దిశ హంతకుల నేర చిట్టా భయం పుట్టిస్తుంది. ఎదురు కాల్పుల్లో మరణించిన ఆ నలుగురు చనిపోక ముందు పోలీసుల ఎదుట వెల్లడించిన వివరాలు అధికారులను షాక్కు గురి చేశాయి. వారు చంపింది దిశను మాత్రమే కాదు అలా మరో 9 మందిని హత్య చేసి దహనం చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ప్రధాన సూత్రధారి అరిఫ్ అలీ ఆరుమందిని, చెన్నకేశవులు ముగ్గురిని హత్యలను చేసినట్లు ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యలన్నీ మహబూబ్నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్నాటక ప్రాంతాల్లో హైవే రహదారుల వద్ద చేసినట్లు ఒప్పుకున్నారు .ప్రతి ఘటనలో మహిళల పై లైంగిక దాడి, ఆ తర్వాత హత్య, అనంతరం మృతదేహన్ని దహనం చేయడమే వీరి నేర ప్రక్రీయగా పెట్టుకున్నట్లు తెలిసింది. నిందితులు వెల్లడించిన వాంగ్మూలం ఆధారంగా సైబరాబాద్ పోలీసు అధికారులు ఆ ప్రాంతాల్లో గాలింపును చేపట్టారు.
మిస్టరీని ఛేదించాలని…..
అయితే ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో అలాంటి సంఘటనలు జరిగి మొత్తం 15 వరకు ఉండడంతో పోలీసు అధికారులు వాటన్నింటికి సంబంధించిన డీఎన్ఏ పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నారు. చాలా వాటిల్లో మృతదేహలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షల్లో పోలీసులకు సహకరించే విధంగా ఫలితాలు రాలేదు. దీంతో పోలీసులు శాస్త్రీయంగా పద్ధతుల్లో మరి కొన్ని కోణాల్లో నిర్ధారించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా హైవేలకు అనుకుని ఉన్న ప్రాంతాల్లో జరిగిన 15 హత్య కేసుల చిట్టా వివరాలను సేకరిస్తున్నారు. దీని కోసం అరిఫ్ అలీ, చెన్నకేశవులు, నవీన్, శివల డీఎన్ఏ ను సేకరించిన పోలీసులు వాటితో హత్యకు గురైన 15 మంది మృతుల డీఎన్ఏలతో విశ్లేషించనున్నారు. వాటితో పోలితే సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా చార్జీషీటులో వీటన్నింటిని ఆధారాలతో పొందుపర్చే అవకాశం ఉంది. పోలీసులు గుర్తించిన 15 మంది మహిళల హత్య కేసులలో అధికంగా ఇంకా మిస్టరీ వీడలేదని సమాచారం.