Thu Apr 25 2024 21:48:32 GMT+0000 (Coordinated Universal Time)
రంగులు వేయలేం.. అది నిరంతర ప్రక్రియ
రేషన్ పంపిణీ వాహనాలకు రంగులు వేయడమంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయలేమని తెలిపారు. [more]
రేషన్ పంపిణీ వాహనాలకు రంగులు వేయడమంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయలేమని తెలిపారు. [more]
రేషన్ పంపిణీ వాహనాలకు రంగులు వేయడమంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయలేమని తెలిపారు. రేషన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. నవరత్నాలకు సంబంధించిన ఫొటోలు రేషన్ వాహనాలపై ఒకవైపు ఉన్నాయని కోర్టుకు వివరించారు. రేషన్ వాహనాల పంపిణీ ప్రకటన ప్రభుత్వం డిసెంబరు 19వ తేదీన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఫొటోలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్ తరుపున న్యాయవాది తమ వాదనలను వినిపిస్తారు.
Next Story