అబ్బాయి కోసమే….బాబు తాపత్రయం…!!
గుంటూరు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గర్జించారు. చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. ఇన్నిరోజులుగా కేంద్రంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. [more]
గుంటూరు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గర్జించారు. చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. ఇన్నిరోజులుగా కేంద్రంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. [more]
గుంటూరు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గర్జించారు. చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. ఇన్నిరోజులుగా కేంద్రంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. గుంటూరులో ఆదివారం జరిగిన బీజేపీ ప్రజా చైతన్య సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
* గత 55 నెలల్లో ఏపీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. కేంద్రం నుంచి వచ్చిన డబ్బును సరిగ్గా వాడకుండా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోంది చంద్రబాబు.
* ఏపీ కోసం తాము ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటుచేశాం. ప్రత్యేక హోదా ద్వారా ఎన్ని నిధులు రావాలో ప్యాకేజీ ద్వారా కూడా అన్ని నిధులు ఇచ్చాము. ఇందుకు గానూ అసెంబ్లీలో కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు కూడా చెప్పారు. తీర్మానం కూడా చేశారు. కానీ చేతకాని ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు.
* విభజన చట్టంలో పొందుపర్చిన అన్ని హామీలు నెరవేర్చాం. విభజన చట్టంలోని 11 విద్యాసంస్థల్లో ఇప్పటికే 10 సంస్థలు ఏర్పాటుచేశాం. 10 సంవత్సరాలు సమయం ఉన్నా నాలుగున్నరేళ్లలో విభజన చట్టంలోని అనేక హామీలను పూర్తి చేశాం.
* రాష్ట్రానికి 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులు కేటాయించాము.
* తనపై ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
* తనకు సంపద సృష్టించడం రాదని లోకేష్ తండ్రి అంటున్నారు. నిజమే నాకు సంపదించుకోవడం తెలియదు. కానీ, లోకేష్ తండ్రి ఇందులో సిద్ధహస్తుడు. ప్రజలు అధికారం ఇచ్చింది మన సంపదను పెంచుకోవడానికి కాదు, దేశ సంపదను పెంచడానికి.
* చంద్రబాబు చేరింది ఓ కలుషిత కూటమి. అందులోని వారందరికీ.. స్వార్థం, అవకాశవాదం తప్ప మరోటి లేదు. కూటమిలోని వారంతా పేదలకు, దేశానికి మోసం చేసిన వారే. ఆరోపణలు ఎదుర్కుంటున్న వారే.
* బాప్ – బేటా రాజకీయం కోసం తనను తిడుతున్నా నేను మౌనం వహించాను. కానీ, తన ప్రసంగం వినేందుకు వచ్చిన వారి కోసమే వివరణ ఇస్తున్నాను. బాప్ – బేటా సర్కార్ త్వరలోనే వెళ్లిపోయే సమయం వచ్చేసింది.
* ఆంధ్రప్రదేశ్ లో మౌళిక సధుపాయాలు కల్పిస్తానని తనతో చెప్పిన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.
అమరావతిని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రభావం తన పార్టీని పునర్నిర్మించుకునే పనిలో పడ్డారు.
* ఏపీని సన్ రైజ్ స్టేట్ చేస్తానన్న ముఖ్యమంత్రి తన కుమారుడిని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెడుతున్న పథకాలకు చంద్రబాబు స్టిక్కర్లు అంటించుకుంటున్నాడు.
* మాటిమాటికి తన కంటే సీనియర్ ను అని చంద్రబాబు చెప్పుకుంటారు. నిజమే ఆయన సీనియర్. ఆయన సీనియర్ నాయకుడని తాను ఎప్పుడూ గౌరవమిచ్చాను.
* పార్టీ ఫిరాయింపులు చేయించడంలో చంద్రబాబు సీనియర్. అవకాశవాదం, స్వర్థంతో కొత్త కూటములు కట్టడంలో సీనియర్. మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్. ప్రతీ ఎన్నికల్లో ఓడిపోవడంలో చంద్రబాబు సీనియర్. ఇవాళ ఎవరిని తిడతారో రేపు వారితోనే కలవడంలో చంద్రబాబు సీనియర్.
* ఎన్టీఆర్ వారసుడిగా చెప్పుకుంటున్న వారు ఎన్టీఆర్ కలలను నెరవేర్చారా..? మీకు ఏ ఇబ్బంది వచ్చిందని రాష్ట్రానికి అన్యాయం చేసిందో కాంగ్రెస్ వద్దకు చేరారు.
* కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఆ పార్టీ వారి ముందు చంద్రబాబు ఎందుకు మోకరిల్లారు?
* ఎన్టీఆర్ చెప్పిన దుష్ట కాంగ్రెస్.. ఇవాళ చంద్రబాబుకు దోస్త్ కాంగ్రెస్ అయ్యింది. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.
* ఒక్కసారి గెలిచిన తర్వాత చంద్రబాబు మరో ఎన్నికల్లో గెలిచింది లేదు. అదే భయంతో చంద్రబాబు తమపై విమర్శలు చేస్తున్నారు.
* ఆయన కుమారుడిని రాజకీయాలపై రుద్దాలి అనేది చంద్రబాబు ప్రయత్నం.
* అమరావతి నుంచి పోలవరం వరకు చంద్రబాబు పెంచుకున్న సంపదను కాపాడుకోవడానికే తనకు వ్యతిరేకంగా మారారు. పెరిగిన ఆయన సంపదను కాపాడుకోవాలనేదే చంద్రబాబు ప్రయత్నం. అందుకే చంద్రబాబుకు ఈ చౌకీదార్ను చూసి నిద్రపట్టడం లేదు.
* రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన సొమ్ముకి లెక్కలు చెప్పమని చెబుతున్నందుకే చంద్రబాబుకు కోపం వస్తోంది. చంద్రబాబుకు ఇంతకుముందు ఎన్నడూ లెక్కలు చెప్పిన అలవాటు లేనట్లుంది.
* ఇవాళ తాము ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎటువంటి ఆర్భాటం లేకుండా చేశాము… కార్యకర్తల ఖర్చుతో పార్టీ సభను ఏర్పాటు చేశాము.
* అదే రేపు చంద్రబాబు దీక్ష పేరుతో ఫోటో దిగడానికి ఢిల్లీ వెళుతున్నారు. ఇందుకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీ వచ్చి తనను తిట్టే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఖర్చు లెక్కలు చెప్పాలి.
* టీడీపీ తనను గో బ్యాక్ అంటున్నందుకు ధన్యవాదాలు. వారన్నట్లుగానే మళ్లీ తాను వెళ్లి ఢిల్లీలో అధికారంలోకి రానున్నాము. కోట్ల మంది ప్రజలు కూడా ఆదే ఆశిస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంస్కారవంతులని దేశం మొత్తం అనుకుంటుంది. కానీ చంద్రబాబు కొన్ని రోజులుగా తనపై వాడుతున్న మాటలు ఏపీ ప్రజలను అవమానించేలా ఉన్నాయి.
* కొత్త పనిని ప్రారంభించే ముందు దిష్టి తగలకుండా నల్లబొట్టు పెట్టుకుంటారు. ఇవాళ కూడా తమకు దిష్టి తగలకుండా టీడీపీ నల్ల బెలూన్లను ఎగరేసింది.