Thu Mar 28 2024 16:37:49 GMT+0000 (Coordinated Universal Time)
అరవై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష
నంద్యాల కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అరవై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది
నంద్యాల కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అరవై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికపై అత్యాచారం కేసులో ఈ శిక్ష విధించింది. పుల్లయ్య అనే అరవై ఏళ్ల వ్యక్తి తన మనవరాలు వయసు ఉన్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో జడ్జి ఈ తీర్పు చెప్పారు. ప్రస్తుతం ఆ వృద్ధుడి వయసు అరవై ఏళ్లు.
వరసకు మనవరాలు...
పుల్లయ్య అనే వృద్ధుడు తనకు వరసకు మనవరాలు అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 2019లో ఈ ఘటన జరిగింది. కోవెలకుంట్ల మండలం ఉప్పులూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 2019లో పుల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల విచారణ అనంతరం పుల్లయ్యకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష నంద్యాల కోర్టు విధించింది.
Next Story