Thu Mar 28 2024 10:17:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ కడప జిల్లాలో దారుణం.. వరదలో కొట్టుకుపోయిన 15 మంది
రాజంపేటలో చెయ్యేరు నది పోటెత్తింది. వరద ఉధృతికి పదిహేను మంది నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది
రాజంపేటలో చెయ్యేరు నది పోటెత్తింది. వరద ఉధృతికి పదిహేను మంది నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు అధికారులు తరలిస్తున్నారు.
పదిహేను మంది....
వరద ఉధృతి ఉందని తెలిసి కొందరు నది దాటే ప్రయత్నం చేస్తున్నారు. పదిహేను మంది నదిలో కొట్టుకుపోయినట్లు సంమచారం. మందపల్లి, పాపరాజు పల్లి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. సహాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు
Next Story