Fri Jan 17 2025 07:43:44 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ పదవీ కాలాన్ని ఏడాది కాలం పొడిగిచారు.అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. అజయ్ కల్లాం పదవీ కాలాన్ని కూడా ఏడాది పొడిగించారు. అజయ్ కల్లాం కూడా ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు.
వచ్చే ఏడాది జూన్ వరకూ...
ఈ ముగ్గురి పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిింది. వచ్చే ఏడాది జూన్ వరకూ వీరు ముగ్గురు పదవుల్లో కొనసాగనున్నారు.
[
Next Story